నవతెలంగాణ-హైదరాబాద్: భోటేకేసి, త్రిశూలి నదులకు పొటెత్తిన ఆకస్మిక వరదలు నేపాల్ లో జల ప్రళయాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికి వరకు 1344 మృతి చెందినట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడిచింది. అదే విధంగా ముప్పు ప్రాంతాల్లో విదేశీ విపత్తు దళాలతో కలిసి నేపాల్ ఆర్మీ బలగాలు సహాయక చర్యలను ముమ్మరంగా సాగిస్తున్నాయి. వరదల ధాటికి కూలిపోయిన వంతెనల స్థానంలో పలు రోప్ వే బ్రిడ్జిలను ఆర్మీ నిర్మిస్తోంది. ఉప్పొంగిన తాడి నదిపై సైనిక ఇంజనీరింగ్ యూనిట్లు ఒక తాళ్ల వంతెనను నిర్మించాయి. అదనంగా 20 హెలికాప్టర్లలను కేటాయించి పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన నివాసితులను రక్షించడానికి వైమానిక కార్యకలాపాలను నిరంతరం కొనసాగిస్తున్నాయి. అందుకు సంబంధించినే దృశ్యాలను నేపాల్ సైన్యం ఎక్స్ వేదికగా విడుదల చేసింది.
Nepal floods: కొనసాగుతున్న సహాయక చర్యలు..వీడియో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



