- Advertisement -
నవతెలంగాణ – కన్నాయిగూడెం
మండలంలో గురువారం రోజున తహసిల్దార్ కార్యాలయము ఆవరణములో చలివేంద్రము ఏర్పాటు చేయడం చేశారు. అనంతరం తహశీల్దార్ సర్వసయ్యద్ మాట్లాడుతూ.. ఎండలు తీవ్రంగా ఉండడంతో కార్యాలయ ఆవరణంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ చలివేంద్రాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో యంపిడివో, సర్పంచ్ లు , ఉప సర్పంచ్ లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



