తెలంగాణ అభివృద్ధే మాకు ముఖ్యం
మూడేండ్లలో తిరిగి అధికారంలోకి వస్తాం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
డల్లాస్లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో ఇబ్బందులు పడుతున్న తెలుగు విద్యార్థులకు తమ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీనిచ్చారు. అమెరికాలో లీగల్ సెల్ను ఏర్పాటు చేయటం ద్వారా వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన భరోసానిచ్చారు. అమెరికాలోని డల్లాస్లో సోమవారం నిర్వహించిన తెలంగాణ అవతరణ వేడుకలు, బీఆర్ఎస్ రజతోత్సవాల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టటం ద్వారా మాతృభూమి రుణం తీర్చుకోవాలంటూ ఆయన ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్గా తాము ఓట్లలో వెనుకబడ్డామేమోగానీ, రాష్ట్రాన్ని ప్రేమించటంలో ఎప్పుడూ వెనుకబడలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో కేవలం పదేండ్ల వ్యవధిలోనే తెలంగాణ దేశంలోనే నెంబర్వన్గా నిలిచిందని చెప్పారు. పొజీషన్(అధికారం)లో ఉన్నా.. అపొజీషన్ (ప్రతిపక్షం)లో ఉన్నా తెలంగాణ ప్రయోజనాలు, అభివృద్ధే తమకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. మూడేండ్లలో తమ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. డల్లాస్ను చూస్తే తెలుగు వారికి రెండు రాష్ట్రాలు కాదు, మూడు రాష్ట్రాలు ఉన్నాయనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అక్కడి తెలుగు వారు అంతలా బీఆర్ఎస్ను, తమను అక్కున చేర్చుకున్నారని ప్రశంసించారు.
ట్రంప్ బాధితులకు అండగా ఉంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES