- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాత మధు తమ పదవికి వెంటనే రాజీనామా చేయాలని డోంగ్లి మండలంలోని పెద్ద టాక్లి గ్రామ సర్పంచ్ కుమారుడు దళిత నాయకుడు, గాయకుడు విలాస్ డిమాండ్ చేశారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గంలో స్థాయి నిరసన కార్యక్రమం మంగళవారం పిట్లం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ నిరసన ఆందోళన కార్యక్రమానికి డోంగ్లి మద్నూర్ మండలాలకు చెందిన నాయకులు తరలి వెళ్లారు.
- Advertisement -



