- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గం మండలంలోని వల్లెంకుంట గ్రామానికి చెందిన మెట్టు సౌజన్య అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం చేయించడానికి ఆర్థికంగా ప్రభుత్వ సాయం కోసం రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబును బాధిత కుటుంబ సభ్యులు విన్నవించారు. ఈ నేపథ్యంలో మంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 2,50 లక్షల ఎల్ఓసిని మంజూరు చేసి ఇప్పించారు. ఇందుకు బాధిత కుటుంబం మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



