- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లా, మంఝన్పూర్ మహిళా PS లో తాజాగా విషాద ఘటన జరిగింది. మంగళవారం ఉదయం విధి నిర్వహణలో ఉన్న ప్రియాంక యాదవ్ అనే 28 ఏళ్ల మహిళా కానిస్టేబుల్, కుర్చీలో కూర్చుంటుండగా ఆమె వద్ద ఉన్న సర్వీస్ రైఫిల్ నుండి బుల్లెట్ పేలింది. తీవ్ర గాయాలపాలైన ప్రియాంకను తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
- Advertisement -



