పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించండి :కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సీతక్క వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహాత్మ గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం అమలు, వీబీజీఆర్ఏఎం-జీ చట్టం అంశాలపె కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర మంత్రులతో నిర్శహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొని తెలంగాణలో ఎదరవుతున్న సమస్యలను ప్రస్తావించారు. వీబీజీఆర్ఏఎం-జీ చట్టంపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందనీ, రాష్ట్రాల అభిప్రాయాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉపాధీ హమీ చట్టానికి సంబంధించి రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన రూ.1,110 కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నాయనీ, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉపాధిలో కొత్త సాఫ్ట్వేర్ వ్యవస్థలను వరుసగా ప్రవేశపెట్టడం క్షేత్రస్థాయిలో సమస్యలను కలిగిస్తోందని వివరించారు. మోబైల్ నెట్ వర్క్ అంతగా లేని మారు మూల ప్రాంతాల్లో కూలీల ఫేస్ క్యాప్చరింగ్లో నిబంధనలను సడలించాలని కోరారు. తక్కువ సమయంలోనే వీబీజీఆర్ఏఎం-జీ చట్టం ద్వారా ఉపాధీ పనుల్లో 40 శాతం నిధులను భరించాలనే నిబంధన రాష్ట్రాలకు భారంగా మారుతుందన్నారు. నూతన చట్టంలో 60 రోజుల పాటు ఉపాధీ హలీడేను ప్రకటించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.ఒక సారి కూలీలు పట్టణాలకు వలస పోతే తిరిగి గ్రామాలకు రావడం కష్టమనీ, ఇది ఉపాధీ హమీ చట్ట లక్ష్యానికి పూర్తి విరుద్దమన్నారు. ఈ నేపధ్యంలో ఏడాదంతా ఉపాధి హమీ పనులు కొనసాగించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి సీతక్క ప్రస్తావించిన అంశాల పట్ల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు . తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేస్తామన్నారు. వీబీజీఆర్ఏఎం-జీ చట్టం పట్ల రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, చర్చల అనంతరమే అమలు చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సంజరు కుమార్, డైరెక్టర్ దివ్యా దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



