- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని తడి ఇప్పర్గా కుర్లా యనబోరా ఈలేగావ్ తదితర గ్రామాల్లో వరి ధాన్యం కోతకు వచ్చి తేమశాతం కోసం వరి ధాన్యం ఆరబెట్టారు. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు రావడం అకాల వర్షంతో ఎండ బోసిన వరి ధాన్యం రాశులు తడిసిపోయాయి. దీంతో గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యం కోతకు వచ్చిన సమయంలో వాతావరణంలో మార్పు అకాల వర్షాలు పడటం పంటకు నష్టం కలిగిస్తుందని వారు వాపోయారు.
- Advertisement -



