ప్రభుత్వ పాఠశాలల కొత్త భవన నిర్మాణాలకు
సీఎంకు తెలంగాణ పౌర స్పందన వేదిక లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పాఠశాలలకు కొత్త భవనాల నిర్మాణాల కోసం నిధులు కేటాయించి ఆ నిర్మాణాలను పూర్తి చేయాలని తెలంగాణ పౌర స్పందన వేదిక కోరింది. విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సాధన కమిటీల అధ్యక్షులు కోరిన విషయాలతో వేదిక రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రాధేశ్యాం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి మంగళవారం లేఖ రాశారు.
”కోర్ అర్బన్ రీజియన్ పరిధి, మల్కాజిగిరి మున్సిపల్ కార్పోరేషన్ (మేడ్చల్ జిల్లా)లోని జవహర్ నగర్లో ప్రాంతంలో లక్షకు పైగా జనాభా కలిగిన ఐదు కాలనీలు ఉన్నాయి. ఈ సంవత్సరమే రెండు గదులు అద్దెకు తీసుకొని ఒక ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేశారు. నమోదు 125 పైగా ఉన్నది. ఇక్కడ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు మంచి వసతులతో కూడిన పాఠశాల అవసరం ఉన్నది. ప్రభుత్వ స్థలాలు కూడా అందుబాటులో ఉన్నట్టు తెలిసింది. స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేసి, వెంటనే భవన నిర్మాణం ప్రారంభించాలని …” వారు విజ్ఞప్తి చేశారు.
స్టేషన్ డబీర్పుర ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను నివాసాల కోసం నిర్మించిన ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ మీడియంను ప్రీ ప్రైమరీ నుంచి ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని సూచించారు. ఇప్పటికే ప్రధానోపా ధ్యాయులు, ఉపాధ్యాయుల కృషితో 115 మంది విద్యార్థులు నమోదయ్యారని చెప్పారు. కాలదేరా ప్రభుత్వ క్వార్టర్స్లోని నాలుగు బ్లాకులు బి-23, బి-7, బి-15, బి-18 ఖాళీగా శిథిలావస్థలో ఉన్నా యనీ, ఆ నాలుగు బ్లాకుల స్థలాన్ని పాఠశాలకు కేటా యించి, మంచి భవనాన్ని నిర్మిస్తే ప్రీ ప్రైమరీ నుంచి 10వ తరగతి వరకు 1000 మందికి పైగా విద్యార్థు లు ఉచితంగా చదువుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణా నికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
”ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సీతాఫల్మండి-2 హైదరాబాద్ జిల్లా, మారేడుపల్లి మండలము, తార్నాకలోని విజయ డైరీ క్వార్టర్స్ డి బ్లాక్లో నిర్వ హించబడుతుంది. ఈ క్వార్టర్స్ శిథిల స్థితికి చేరుకో వటంతో నివాసితులందరూ ఖాళీ చేసి వెళ్లి పోయారు. పాఠశాల మాత్రం అక్కడే నిర్వహించ బడుతుంది. నమోదు-54. ఇక్కడ చుట్టుపట్ల ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాల లేదు. డి బ్లాక్ మొత్తం 8000చ.గ స్థలం లో ఉన్నది. ఈ స్థలంలో మంచి బిల్డింగ్ నిర్మిస్తే, ప్రీ ప్రైమరీ నుంచి 10వ తరగతి వరకు 2000 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించవచ్చు. ఈ స్థలాన్ని ప్రభుత్వ పాఠశాలకు కేటాయించి, భవన నిర్మాణాన్ని ప్రారంభించాలి”అని వారు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ జిల్లా, మారేడుపల్లి మండలంలోని సీతాఫల్మండి ప్రభుత్వ ఉన్నత, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల భవనం శిధిలావస్థలో ఉందనీ, 2022లో కూల్చివేశారని వారు తెలిపారు. కొత్త భవన నిర్మాణానికి రూ.14 కోట్లు కేటాయించి, జీవో జారీ చేసినా నిధులు విడుదల చేయకపోవడంతో నిర్మాణం ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలు ఉస్మానియా యూనివర్సిటీ లోని మోడల్ హైస్కూల్ భవనంలో షిఫ్ట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారనీ, వెంటనే నిధులు విడుదల చేసి, భవన నిర్మాణం పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు.
నిధులు కేటాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



