- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని, సమ్మె విరమించి చర్చలకు రావాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. 32 సమస్యల్లో 29 అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆర్టీసీని నిర్వీర్యం చేసుకోవద్దని ఆయన సూచించారు. కమిటీ వేసి, 4 వారాల సమయం అడిగామని, గత ప్రభుత్వం చేపట్టిన చర్యలను గుర్తుంచుకోవాలని మంత్రి పొన్నం అన్నారు. ఆర్టీసీని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన భరోసా ఇచ్చారు.
- Advertisement -



