- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో సర్వీసులను పెంచుతున్నట్లు ప్రకటించింది. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో రైలు అందుబాటులో ఉంటుంది. అలాగే, నాగోల్-రాయదుర్గం మార్గంలో ప్రతి 3 నిమిషాల 40 సెకన్లకు ఒక మెట్రో సర్వీసు నడుస్తుంది. ఈ చర్యతో ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.
- Advertisement -



