- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని అన్నారం అంగన్వాడీ సెంటర్లో బుధవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లత శ్రీనివాస్ మాట్లాడుతూ.. అంగన్వాడీలో పౌష్టిక ఆహారంతో పాటు, ఆటలు పాటలతో ఎదిగిన కిషోర బాలలు వచ్చే విద్యా సంవత్సరంలో మండల పరిషత్ పాఠశాలలో విద్యను అభ్యసించి మంచి ఫలితాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దయానంద్, సూపర్వైజర్ ఉమాదేవి, పాలకవర్గ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



