Sunday, September 13, 2026
E-PAPER
Homeఖమ్మంసింగరేణి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

సింగరేణి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
సత్తుపల్లి సింగరేణి ఏరియా జీఎం సరికొండ వెంకటాచారి ఆదేశాల మేరకు వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ​పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో భాగంగా సింగరేణి సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీ,  జేవీఆర్ సీహెచ్‌పీ ప్రాంగణాల్లో ఉద్యోగులకు మట్టి విగ్రహాలను ఆదివారం  అందించారు. ​జేవీఆర్ ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్వీఆర్ ప్రహ్లాద్ స్వయంగా పాల్గొని ఉద్యోగులకు విగ్రహాలు అందజేశారు.

కిష్టారం ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సునీల్ వర్మ, జేవీఆర్ సీహెచ్‌పీ ఎస్‌ఈ సాయినాథ్ ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ​పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయకులనే పూజించాలని ఈ సందర్భంగా అధికారులు  పిలుపునిచ్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో సింగరేణి సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఇంజనీర్ డి. శ్రీనివాసరావు, ఎస్ఓఎం బెజ్జంకి రాజేశ్వరరావు, పర్యావరణ అధికారి సంతోష్ కుమార్, వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్, సింగరేణిలోని వివిధ విభాగాల అధికారులు, సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -