- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని కొండూరు గ్రామంలో సోమవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైనటువంటి సీఎం సహాయ నిధి చెక్కులను కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ మేరకు లబ్ధిదారులైన ఊడుగు అంజయ్యకు రూ.23,500-, జర్పుల నానుకు రూ.17,000- చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జమ్ముల వెంకటేష్ గౌడ్, బాయికాడి కొండల్, ఉడుగు శ్రీను, ఉడుగు అంజయ్య, జాల వెంకటయ్య, తన్నీరు యాదయ్య, సీత యాదయ్య, దండుగల కొండల్, కొలకులపల్లి జంగయ్య, చెరుకు యాదయ్య, బండి యాదయ్య, కర్నాటి నర్సింహ, బైకడి రాజు, అంకెం నవీన్, జర్పుల శంకర్, ఆవుల రమేష్, జర్పుల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



