- Advertisement -
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని ఆలేరు సెక్టార్ పరిధిలోని ఆలేరు గ్రామం అంగన్వాడి సెంటర్ టులో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకను నిర్వహించినట్లు ఆ గ్రామ అంగన్వాడీ టీచర్లు మంజుల రాజేశ్వరి దేవకి తెలిపారు. గురువారం పిల్లలకి పదాలు చెప్పించడం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రంలో దొరికే పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు తల్లులకు కావలసినటువంటి పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని, అది మీకు మా అంగన్వాడీ సెంటర్లో లభ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లులు పాల్గొన్నారు.
- Advertisement -



