Friday, April 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వం ఎన్నికల హామీల జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి

ప్రభుత్వం ఎన్నికల హామీల జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి

- Advertisement -

డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగపూర్ మధు
నవతెలంగాణ- అచ్చంపేట
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా యూత్ డిక్లరేషన్ ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలని  భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి నాగపూర్ మధు డిమాండ్ చేశారు. గురువారం అచ్చంపేటలో  పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. మధు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ వెంటనే అమలు చేసి ఉద్యోగ నోటిఫికేషన్ వెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.  గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ లకు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు తెలుపుకుంటుందని ఆయన విమర్శించారు.

జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రతి సంవత్సరం వివిధ ప్రభుత్వ శాఖల లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని హామీనిచ్చి అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తుందన్నారు. ప్రభుత్వాలు మారిన నిరుద్యోగుల బతుకులు మాత్రం మారడం లేదన్నారు.  సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేవలం 60 వేల ఉద్యోగాలు మాత్రమే  భర్తీ చేశారు  ఇంకా లక్షా నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు.

లక్షలాదిమంది నిరుద్యోగులు వేల రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే… ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా చేస్తుందన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పసుపుల శివశంకర్,  డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు వర్ధం సైదులు , పట్టణ కార్యదర్శి అమరేందర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు మహేష్, నరేష్, రంజిత్, కళ్యాణ్, సాయి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -