నవతెలంగాణ – రాయపర్తి : గ్రామసభలు నిర్వహించి, అర్హులను గుర్తించి, ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కిషన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ కార్యాలయంలోనే సమావేశమై అర్హులను గుర్తించడం అనైతికం అన్నారు. ఇందిరమ్మ ఇండ్లను అధికారులు కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించడం సరికాదన్నారు. ఇకనైనా పార్టీలకు అతీతంగా అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల నాయకులు ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, కుందూరు యాదగిరి రెడ్డి, మాజీ సర్పంచులు కర్ర రవీందర్ రెడ్డి, చిన్నల లక్ష్మి నారాయణ, చెడుపాక కుమార్, మాజీ ఎంపీటీసీ నార్లపురం రాజు, నాయకులు చిన్నల శ్రీనివాస్, ఆశ్రఫ్ పాషా, ఉబ్బని సింహద్రి, ఐత రవి, ఉబ్బని మధు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామసభలు నిర్వహించి అర్హులకు ఇండ్లివ్వాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES