- Advertisement -
ప్రజాపాలన వేడుకల్లో శాట్ ఎండీ సోనిబాలా దేవి
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్) ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు గురువారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ‘క్రీడాభివృద్దికి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాలు చేపట్టింది. క్రీడా ప్రతిభను వెలికతీయం, యువతను క్రీడల వైపు ఆకర్షితులను చేయటం, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, సదుపాయాలు కల్పిస్తూ తెలంగాణ క్రీడా శక్తిని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని శాట్ వీసీ, ఎండీ సోనీబాలా దేవి అన్నారు. ప్రజాపాలన వేడుకల్లో స్పోర్ట్స్ అధారిటీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, కోచ్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



