- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లోని వనస్థలిపురంలో దారుణం హత్య జరిగింది. ఎన్జీవోస్ కాలనీ బస్టాండ్ సమీపంలో పాల వ్యాపారి భుజంగరావు (60)ను దుండగులు హతమార్చారు. బైక్పై ఆయన వెళ్తుండగా మెడపై కత్తితో నరికి చంపారు. భూ వివాదం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. నిందితుల ఆచూకీ కోసం సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
- Advertisement -



