నవతెలంగాణ-తలకొండపల్లి
మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రంగారెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సీహెచ్ శ్రీను, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీకాంత్, పశు వైద్యశాలలో డాక్టర్ అగ్నివేష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ స్నేహ, గట్టుఇప్పలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సైదమ్మ, ప్రాథమిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏఈఓ ప్రతాప్రెడ్డి, ఐకేపీ కార్యాలయంలో శ్రీదేవి, మండల పిఎసిఎస్ చైర్మన్ గట్ల కేశవరెడ్డి, తలకొండపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో డోకురు ప్రభాకర్ రెడ్డి, రైతు వేదిక కార్యాలయంలో ఏఈఓ రాజు, మండల విద్యుత్ అధికారి ఏఈ కటారా, కస్తూర్బా గాంధీ పాఠశాలలో రేణుక, వివిధ గ్రామపంచాయతీలో సర్పంచులు వెల్జాల్ సంగీత శ్రీనివాస్ యాదవ్, దేవుని పడకల్ శ్రీశైలం, చౌదర్ పల్లి చంద్రయ్య, చెన్నారం స్వప్న భాస్కర్ రెడ్డి, గౌరిపల్లి నరేందర్ గౌడ్, పెద్దాపూర్ తండ సక్రి కిషన్ నాయక్, వెంకటాపూర్ తండా రమేష్, వెంకట్రావుపేట్ హైమావతి రమేష్, వెంకటాపూర్ రమేష్ యాదవ్, రాంపూర్ శ్యామ్ సుందర్ రెడ్డి, తుమ్మలకుంట తండా లక్ష్మణ్ నాయక్, జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, పద్మ నరసింహ, ఎంపీటీసీ హేమ రాజు, ఉప సర్పంచ్ పద్మ అనిల్, శేఖర్ యాదవ్, వార్డు సభ్యులు పాండు, విట్టల్, మల్లేష్, నరసింహ, కృష్ణ, అధికారులు ఏపీఓ కృష్ణ , శ్యామ్ సుందర్, రాధాకృష్ణ, తన్నయ్య, ఉప సర్పంచ్ వరలక్ష్మి రామాంజనేయులు, వార్డు సభ్యులు రమేష్ నాయక్, మల్యా నాయక్, రాములు, ఆనంద్, ప్రధానోపాధ్యాయులు కొండల రెడ్డి, ఉపాధ్యాయులు అరుణకుమారి, అంగన్వాడీ టీచర్ అనంతమ్మ, పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి, స్కూల్ చైర్మన్ మల్లేష్, యూత్ కమిటీ మెంబర్స్ యువకులు విద్యార్థులు మహిళలు గ్రామ పెద్దలు నాయకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.