నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్ మాజీ ప్రధాని, ప్రతిపక్షనేత మాధవ్ కుమార్ పై కేసు నమోదైంది. అధికారంలో ఉన్నప్పుడు ఓ ఒప్పందం విషయంలో అక్రమంగా భూ కేటాయింపులు చేశారని అభియోగంతో ఆదేశ దర్యాప్తు CIAA.. ప్రత్యేక కోర్టు అనుమతితో ఆయనపై కేసు నమోదు చేసింది. దేశ చరిత్రలో ఒక నేపాల్ ప్రధాన మంత్రిపై అవినీతి కేసులో అభియోగం మోపడం ఇదే తొలిసారి. ఈ కేసులో ప్రభుత్వ భూ యాజమాన్య పరిమితి మినహాయింపుల కింద ఒక ప్రైవేట్ కంపెనీ కోసం సేకరించిన భూమిని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అభియోగాల ప్రకారం, మాజీ ప్రధాన మంత్రి 186 రూపాలని( 186 డాలర్లు) లబ్ధి పొందారని ఆదేశ దర్యాప్తు సంస్థ పేర్కొంది. అప్పటి భూ సంస్కరణల మంత్రి దంబార్ శ్రేష్ఠ, అప్పటి ప్రధాన కార్యదర్శి మాధవ్ ఘిమిరే, అప్పటి కార్యదర్శి ఛబీరాజ్ పంత్, ఇతర ఉన్నతాధికారులు ఉద్యోగులతోపాటు మొత్తం 94మంది కేసు ఫైల్ చేసింది. ప్రస్తుత ఆదేశ ప్రభుత్వం వెంటనే ఆయన ఎంపీ సభ్యుత్వాన్ని రద్దు చేసింది.
నేపాల్ మాజీ ప్రధానిపై కేసు నమోదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES