- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి : తుర్కపల్లి మండలం తిరుమలాపురం లో సీఎం బహిరంగ సభ స్థలాన్ని రాచకొండ సి పి సుధీర్ బాబు గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు విభాగాలకు రక్షణ నిమిత్తమై సూచనలు చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వాహనాల పార్కింగ్ విఐపి ల ప్రోటోకాల్ పాటించవలసిన వివరాలను వివరించారు. వివిధ శాఖల సమన్వయంతో ముందుకు పోవాలని కోరారు
- Advertisement -