మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి
లక్ష్మీపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజలు
నవతెలంగాణ – బెజ్జంకి: సుమారు 20 ఏండ్లకు ఇందిరమ్మ ఇళ్లతో లక్ష్మీపూర్ గ్రామంలోని నిరుపేదల కల సాకరమవుతుందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు ముక్కీస రత్నాకర్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా రత్నాకర్ రెడ్డి మాట్లాడారు. షేదోడికి సొంతింటి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని నెలవేర్చడానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పని చేస్తున్నారని కొనియాడారు. లబ్ధిదారులందరూ త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఏఎంసీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, హౌసింగ్ ఏఈ రవళి, పంచాయితీ కార్యదర్శి అనూష, లబ్దిదారులు ఉన్నారు.
20 ఏండ్లకు మళ్ళీ గ్రామంలో ఇళ్ల నిర్మాణాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES