Saturday, June 28, 2025
E-PAPER
Homeజిల్లాలుఉజ్వల భారతి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ఉజ్వల భారతి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

- Advertisement -

బహుళ ప్రయోజనాలు ఉన్న ప్రకృతి కాపాడుకుందాం, భవిష్యత్ తరాల యువతకు భరోసాను కల్పిద్దాం.

ఆచార్య గడ్డం భాస్కర్ సీఈవో ఉజ్వలభారతి

నవతెలంగాణ ఎర్రగట్టు గుట్ట : ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఉజ్వల భారతి ఆధ్వర్యంలో స్థానిక ఎర్రగట్టు సమీపంలోని తిరుమల కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉజ్వల భారతి సిఈఓ ఆచార్య గడ్డం భాస్కర్ మొక్కలు నాటిన అనంతరం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి పరిరక్షణ బాధ్యతను మీ కాలనీవాసులు తీసుకోవాలని కోరినారు. పకృతి వల్ల కలిగే బహుళ ప్రయోజనాలను సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పొంది ప్రపంచ శాంతిని నెలకొల్పాలని తద్వారా మానవ మనుగడ సాధ్యమై భవిష్యత్తు తరాల యువతకు స్వేచ్ఛ,స్వచ్ఛత, స్పష్టత, కలిగి ఉండే విజ్ఞానవంతమైన సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుందని తెలిపినారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలు స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ కలుషితమైన తన చుట్టూ ఉన్న వాతావరణంలో మార్పు తీసుకురావాలని స్వచ్ఛత కలిగిన మనసుతో ప్రపంచ శాంతిని పెంపొందించే భహులా ప్రయోజనాలు కల ప్రకృతి పరిరక్షణ కొరకు స్పష్టత కలిగిన ప్రణాళికలు, వ్యూహాలను, విధివిధానాలను రూపొందించడంతోపాటు వాటి అమలు సక్రమంగా జరిగినప్పుడు సమాజ వినాశనానికి ఉపయోగపడే సాయుధ సంఘర్షణలు యుద్ధాలు మొదలైన విధ్వంసకరమైన చర్యలను నిర్మూలించే అవకాశం ఉంటుంది.

పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రజలందరూ వారి వారి పరిసరాలలో మొక్కలు నాటి వాటి సంరక్షణలో భాగస్వాములు లు కావాలని ఉజ్వల భారతి కోరుకుంటుందని ఆచార్య భాస్కర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిసి రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ మరియు ఉజ్వల భారతి ప్రమోటర్ మాట్లాడుతూ స్వచ్ఛమైన నీరు ,గాలి, వెళ్తురు మరియు మానవ మేధస్సు ద్వారానే భూగోళం శాంతి మండలం గా ఏర్పడుతుందని తెలిపినారు మానవ స్వేచ్ఛ ఆక్సిజన్ వాయువులను పెంచి పోషించే స్థాయిలో ఉండాలి గాని కార్బన్డయాక్సైడ్ లాంటి విషయ వాయువులను విడుదల చేసే ప్రయత్నాలను విడనాడాలని కాలుష్య వాతావరణం కడిగివేయాలని కోరారు కాబట్టి ప్లాస్టిక్ నిషేధిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం ప్రతి పౌరులు తమ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించడంలో కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా తిరుమల కాలనీ వాసులతో అవగాహన ర్యాలీ నిర్వహించి మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణవేత్త విశ్రాంత అధ్యాపకుడు బండ కాళిదాసు, విశ్రాంత ఇంజనీర్ వైద్యం రాజగోపాల్, అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి కాలనీవాసులు మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -