యస్.యం.4 ఫిలిమ్స్ బ్యానర్ పై గీతా సింగ్, కార్తీక్, కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శతి లయ నటీనటులుగా యం.యన్.వి సాగర్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘బ్యాచిలర్స్ ప్రేమ కథలు’. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకులు వి.సముద్ర కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకులు వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. దర్శక, నిర్మాత సాగర్ మాట్లాడుతూ, ‘నేను తీసిన ‘కాలం రాసిన కథలు’ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఆ ఉత్సాహంతోనే దానికి సీక్వెల్గా ‘బ్యాచ్లర్స్ ప్రేమ కథలు’ సినిమా తీస్తున్నాను. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి సోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నాను. అలాగే ఈ చిత్రంతో నూతన నటీనటులను ఇండిస్టీకి పరిచయం చేస్తున్నాను. ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం’ అని తెలిపారు. ‘అందరూ నా పాత్రకు కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ సినిమాలో ఎమోషనల్ పాత్ర చేయ బోతున్నాను. ఈ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాత సాగర్కి థ్యాంక్స్’ అని నటి గీతా సింగ్ చెప్పారు. నటుడు కార్తీక్ మాట్లాడుతూ,’యూత్ మెచ్చే మంచి మెసేజ్ ఉన్న ఇలాంటి సినిమా ద్వారా ఇండిస్టీకి పరిచయం చేస్తున్న సాగర్కి నా ధన్యవాదాలు’ అని అన్నారు. ఈ చిత్రానికి డిఓపి : ప్రసాద్ ఎస్, మ్యూజిక్ : మెరుగు అరమాన్, ఎడిటర్ : నందమూరి హరి.