– టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మూడో విడత ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 16న జరగనుంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 16న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్లోని నాంపల్లి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల హాల్టికెట్ల నెంబర్లను కమిషన్ వెబ్సైట్లో పొందుపర్చా మని పేర్కొన్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు అవసరమైన సమాచారాన్ని వెబ్సైట్లో అందుబాటులో ఉందని తెలిపారు. ఈనెల 16న ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాని వారు 17న రిజర్వు డే రోజు హాజరు కావాలని సూచించారు. ఈనెల 13 నుంచి 17 వరకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో వెబ్ఆప్షన్ల నమోదు చేయాలని కోరారు. ధ్రువపత్రాల పరిశీలనకు గైర్హాజరైన వారు తదుపరి ప్రక్రియకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇతర వివరాల కోసం https://www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరి 19న గ్రూప్-1 నోటిఫికేషన్ను టీజీపీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే.
16న గ్రూప్-1 అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES