సీపీఐ(ఎం) కార్యాలయాన్ని సందర్శించిన వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బందం
న్యూఢిల్లీ : వియత్నాం- భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని వియత్నాం కమ్యూనిస్టు పార్టీ బృందం పేర్కొంది. ఆ సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సి ఉందని తెలిపింది. శుక్రవారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయాన్ని వియత్నాం కమ్యూనిస్టు పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యులు న్గుయెన్ ట్రోంగ్ న్ఘియా, కేంద్ర కమిటీ సభ్యులు ఎన్గో డాంగ్ హై, న్గుయెన్ థాన్ న్ఘి, లే హై బిన్, బ్రిగేడియర్ జనరల్ ఫామ్ న్గోక్ ఫువాంగ్, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ న్గుయెన్ వాన్ డక్, సెంట్రల్ కమిషన్ ఫర్ పబ్లిసిటీ డో ఫువాంగ్ థావో, విదేశాంగ మంత్రిత్వ శాఖ సీనియర్ స్పెషలిస్ట్ న్గుయెన్ ట్రోంగ్ కీన్, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రోటోకాల్ అధికారి ఫామ్ జువాన్ నామ్, విదేశాంగ మంత్రిత్వ శాఖ సభ్యులు లూరు అన్హ్ తువాన్, లెఫ్టినెంట్ కల్నల్ హౌంగ్ ట్రోంగ్ కీన్లతో కూడిన బృందం సందర్శించింది. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, పొలిట్బ్యూరో సభ్యులు ఆర్. అరుణ్ కుమార్, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు మురళీధరన్, రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిట్టాస్లను కలిశారు. ఈ సందర్భంగా రెండు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలను, రెండు దేశాల ప్రజల మధ్యకు తీసుకెళ్లేలా కృషి చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రజల మధ్య సంబంధాలను బలపడేలా చూడాలని పేర్కొన్నారు. సీపీఐ(ఎం), వియత్నాం కమ్యూనిస్టు పార్టీ మధ్య ఎప్పటి నుంచో దగ్గర సంబంధాలు ఉన్నాయని, వియత్నాం విముక్తి పోరాట సమయంలో సీపీఐ(ఎం) అందించిన మద్దతును, ప్రజలను సమీకరించడంలో సీపీఐ(ఎం) చొరవను తాము మర్చి పోమని వియత్నాం బృందం పేర్కొంది. వియత్నాం 8 శాతం జీడీపీతో అభివృద్ధి పదంలో నడుస్తోందని, పేదరికం నానాటికీ తగ్గుతోందని తెలిపింది. జనవరిలో తమ పార్టీ 14వ మహాసభ జరగనుందని, ఈ మహాసభలో వియత్నాం అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడతామని పేర్కొంది. ఆ మహాసభ నిర్ణయాలను సీపీఐ(ఎం)తో కూడా పంచుకుం టామని తెలిపింది. కేరళలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పరిపాలన, అభివృద్ధి చర్యలు బాగున్నాయని విన్నామని వియత్నాం బృందం తెలిపింది.
వియత్నాం – భారత్ మధ్యమంచి సంబంధాలు
- Advertisement -
- Advertisement -