నవతెలంగాణ – కంఠేశ్వర్ : బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఈద్గాలు, మసీదుల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటులను శనివారం క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ప్రధానంగా నిజామాబాదు లోని శాంతి నగర్ ఈద్గా, బోధన్ లోని నర్సి రోడ్డు ఈద్గాలు పర్యవేక్షించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు రాకుండా పోలీస్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాదు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, సిసిఆర్బి ఏసీపీ రవీందర్, మరియు సి.ఐ లు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
బక్రీద్ పండుగ సందర్భంగా బందోబస్తు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES