- Advertisement -
నవతెలంగాణ-కోహెడ
మండలంలోని ఆరేపల్లి గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామంలోని మహిళలు గ్రామస్తులు సోమవారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని గ్రామదేవతలకు వర్షాలు కురవాలని కోరుతూ నీళ్ళతో ప్రత్యేక అభిషేకం చేశారు. అలాగే గ్రామస్తులందరూ బిందెలతో ఒకరు పై ఒకరు నీళ్ళు చాలుకుంటూ ప్రధాన వీధిలో సందడి చేశారు. ఈ ఏడాది వర్షలు సమృద్ధిగా కురవలని రైతన్న కలలో ఆనందాన్ని నింపాలని వరుణ దేవుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిట్యాల బాబు రాజ్, పంచాయతీ పాలకవర్గం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



