Monday, June 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలురోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు దుర్మరణం 

రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు దుర్మరణం 

- Advertisement -

నవతెలంగాణ – నవాబుపేట: ఆదివారం మధ్యాహ్నం నవాబుపేట మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మరణించిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నవాబుపేటకు చెందిన మరికంటి లక్ష్మమ్మ (52),ఆమె కొడుకు మరికంటి యాదగిరి (20) ఇద్దరు కలిసి కొందుర్గు మండల పరిధిలోని ఆగిరాల గ్రామంలో బందువుల వివాహానికి హాజరై బైక్ పై తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో దేపల్లి గేట్ దగ్గరకు రాగానే ట్రాక్టర్ ను ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదాన్ని చూసిన స్థానికులు, అటుగా వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. అయితే పూర్తి సమాచారం ఇంకా తెలియలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేసి, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -