నవతెలంగాణ – కంఠేశ్వర్ : సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మచ్చలేని నాయకుడు పి.సుదర్శన్ రెడ్డికి చోటు లేకపోవడం ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేసినట్లేనని పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ నిజాంబాద్ జిల్లా కమిటీ ఆదివారం జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆరోపించింది. ఎలాంటి అవినీతి మరక లేకుండా ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్న వారికి మొండి చేయి చూపించటం దారుణమన వారన్నారు. అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు కూడా మంత్రివర్గంలో భాగస్వామ్యం లేకపోవడం వివక్షతతో కూడినటువంటిదని వారు ఆరోపించారు. మైనారిటీల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అమలుకు మైనారిటీ మంత్రి ఉండటం ఎంతో అవసరం అని వారు పేర్కొన్నారు. సామాజిక సమీకరణాల పేరుతో ఉమ్మడి నిజాంబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారని. అ సమీకరణాలలో భాగంగా ముస్లిం మైనారిటీలకు ఎందుకు ఇవ్వలేదని వారు ప్రశ్నించారు. పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కే. రామ్మోహన్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవిల్ నారాయణ, జిల్లా నాయకులు ఎండి హమీదద్దీన్, సాంబశివరావు , నరేందర్, బాలదుర్గయ్య, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
మంత్రివర్గంలో జిల్లాకు మొండి చేయి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES