శాట్స్, టీఓఏతో జితేందర్ రెడ్డి సమీక్ష సమావేశం
హైదరాబాద్ : అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 23న అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఒలింపిక్ డే రన్ను నిర్వహిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్వహించనున్న ఒలింపిక్ డే రన్ను విజయవంతం చేసేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్), తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు, టీఓఏ అధ్యక్షలు ఏపీ జితేందర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. శాట్జ్, టీఓఏ సమన్వయం చేసుకుని ఒలింపిక్ డే రన్ ఏర్పాట్లు చేయాలని జితేందర్ రెడ్డి ఆదేశించారు. ఒలింపిక్ డే రన్ నిర్వహణ కమిటీపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి మల్లారెడ్డి, కోశాధికారి సతీశ్ గౌడ్, బిలియర్డ్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షలు అప్పారావు, ఉషు అసోసియేషన్ కార్యదర్శి మనోహర్ జాలా, స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఉమేశ్, శాట్జ్ డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, రవీందర్ సహా పిఆర్ఓ కాలేరు సురేశ్ తదితరులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
ఘనంగా ఒలింపిక్ డే రన్ ఏర్పాట్లు!
- Advertisement -
- Advertisement -