Tuesday, June 10, 2025
E-PAPER
Homeజాతీయంకేరళ తీరంలో సింగపూర్ కంటైనర్ షిప్ లో పేలుడు..

కేరళ తీరంలో సింగపూర్ కంటైనర్ షిప్ లో పేలుడు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా బెయ్ పూర్ తీరానికి సమీపంలో సోమవారం ఉదయం సింగపూర్ కంటైనర్ నౌక లో పేలుడు సంభవించింది. దీంతో ఈ నౌకలో అగ్ని కీలలు అంటుకున్నాయి. ఉదయం 10:30 గంటల సమయంలో నౌక లోపలి డెక్కులో పేలుడు సంభవించింది. కొచ్చికి 315 కిలోమీటర్ల దూరంలో, బెయ్ పూర్ కు పశ్చిమ దిశలో సుమారు 70 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. నౌక కోలోంబో నుంచి మహారాష్ట్రలోని నహవా శేవా (ముంబయి) వైపు ప్రయాణిస్తుంది. 270 మీటర్ల పొడవు ఉన్న ఈ నౌకలో 22 మంది సిబ్బంది ఉన్నారు. ఇది జూన్ 7న కోలంబో నుంచి బయలుదేరింది, జూన్ 10న ముంబయికి చేరుకోవాల్సి ఉండగా.. అనుకోకుండా పేలుడు సంభవించింది. దీంతో అందులో ఉన్న నలుగురు సిబ్బంది గల్లంతు కాాగా.. అయిదుగురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై వెంటనే స్పందించిన భారత నౌకాదళం, కొచ్చిలో తీరానికి చేరాల్సిన నౌకను సహాయక చర్యలకు పంపించింది. భారత తీర రక్షణ దళం ICGS రాజదూత (న్యూ మంగళూరు), ICGS అర్వేశ్ (కొచ్చి), ICGS సచేత్ (అగత్తి) నౌకలను సంఘటన స్థలానికి పంపింది. ఈ సందర్భంగా విమానాన్ని కూడా ఆ ప్రాంతానికి మళ్లించి పరిస్థితి తనిఖీ చేయనున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రెస్క్యూ, అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి. గత నెలలో అలప్పి తీరంలో లైబేరియా దేశానికి చెందిన ఓ నౌక మునిగిన ఘటనతో తీవ్ర పర్యావరణ సమస్యలు తలెత్తాయి. కేరళ రాష్ట్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -