పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

నవతెలంగాణ – శంకరపట్నం
గాలికుంటు వ్యాధి నివారణ టీక కార్యక్రమం శంకరపట్నం మండల పరిధిలోని మెట్టుపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీజన్లలో వచ్చే వ్యాధులలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా ముందస్తు నివారణ చర్యగా 177 పశువులకు పశువైద్యులు డాక్టర్ మాధవరావు ఆధ్వర్యంలో టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆరిఫ్ అహ్మద్, అమీర్ ఖాన్,, స్వామి, పశుమిత్రలు పాల్గొన్నారు.
Spread the love