కాళేశ్వరం తెలంగాణకు జీవధార
జస్టిస్ ఘోష్ కమిషన్కు ఆధారాలిచ్చాం : మాజీమంత్రి హరీశ్రావు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మహారాష్ట్ర, సీడబ్ల్యూసీ అభ్యంతరాలతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు రీడిజైన్ చేయాల్సి వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. కాళేశ్వరం ఎప్పటికైనా తెలంగాణకు జీవధార.. ఈ విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైందని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఏదీ నోటి మాటగా చెప్పలేదు. అన్నీ సాక్ష్యాధారాలతో సహా సమర్పించామని స్పష్టం చేశారు. క్యాబినెట్ నిర్ణయాలు, వాప్కోస్ రిపోర్టులు, సీడబ్ల్యూసీ లేఖలు అన్నీ సమర్పించినట్టు వివరిం చారు. సోమవారం కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసిన అనంతరం బీఆర్కే భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా పిలవడం జరిగిందనీ, కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలియజేశారు. ఆధారాలతో సమా ధానాలను కమిషన్కు అందజేశానని చెప్పారు. కమిషన్ విచారణకు హాజరై రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయాలు ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందామనీ, లోపల ఒకటి చెప్పి బయట మరొకటి చెప్పడం తప్పవుతుందని అభిప్రాయపడ్డారు.
తుమ్మిడిహెట్టిపైనే విచారణ
తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీని ఎందుకు మార్చారనే అంశంపై చాలాసేపు చర్చ జరిగిందనీ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తెలిపారు. దానికి నేనూ, కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి దగ్గరే ప్రాజెక్టు కట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశామనీ, మహారాష్ట్ర కాంగ్రెస్ ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్రఫ్ను కోరగా, చాలా రోజులుగా ముంపు గ్రామాల ప్రజలు మా ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేస్తున్నారనీ, ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పుకోబోమని హసన్ ముష్రఫ్ తేల్చి చెప్పారని అన్నారు. ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్ అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి స్పష్టం చేశారనీ, ఈ విషయాన్ని కూడా కమిషన్ దష్టికి తీసుకు వెళ్ళానని ఆయన తెలిపారు.
తుమ్మిడిహెట్టి కోసం ఐదారు భేటీలు
మహారాష్ట్ర, తెలంగాణ మధ్య ఉన్న తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఐదారు భేటీలు జరిగాయని హరీశ్రావు తెలిపారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిని కలిసి మళ్లీ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలనీ, తెలంగాణకు నీటి అవసరం ఉందని కోరినట్టు చెప్పారు. స్వయంగా కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లి అప్పటి గవర్నర్ విద్యాసాగర్ సమక్షంలో బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ను కలిశారన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మాకంటే ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పార్టీ తరఫున అనేక పోరాటాలు చేసింది తానేననీ, ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేమని ఫడ్నవీస్ తేల్చి చెప్పారని హరీశ్రావు గుర్తు చేశారు.
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంలో ..
కేంద్రంలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏడు సంవత్సరాలు అధికారంలో ఉంటే ఒక్క అనుమతి కూడా సాధించలేదని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఒక్క అంత:రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదనీ, ఒక గుంట భూమిని కూడా సేకరించలేదని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి పట్టించుకోలేదనీ, సెంట్రల్ వాటర్ కమిషన్ తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని లేఖ రాసిందని తెలిపారు. సీడబ్ల్యూసీ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులో ప్రతిపాదించిన రిజర్వాయర్ల సామర్థ్యం కూడా సరిపోదనీ, సామర్థ్యానికి సరిపోయే రిజర్వాయర్లను పెంచుకోవాలని పేర్కొందని చెప్పారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ని బ్యారేజీ నిర్మాణ స్థల ఎంపిక చేయాలని కేసీఆర్ కోరినట్టు తెలిపారు. కేంద్ర సంస్థ వాప్కోస్ లాడార్ సర్వే చేసి, ఎగ్జామిన్ చేసి మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉందనీ, అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవచ్చని తెలిపిందని అన్నారు. వాప్కోస్, సెంట్రల్ వాటర్ కమిషన్, ఇంజినీర్ల సూచన మేరకు మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని హరీశ్రావు తెలిపారు.
నీళ్లు లేనిచోట కాంగ్రెస్ ప్రాజెక్ట్ ప్రతిపాదిస్తే..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడేండ్లుగా పొరుగు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేదనీ, అదేవిధంగా మహారాష్ట్రలో ముంపునకు గురవుతున్న చోట చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉందని, ఈ వైల్డ్ లైఫ్ అనుమతులు లభించాలంటే కనీసం 10 సంవత్సరాలు సుప్రీంకోర్టులో కొట్లాడాల్సి వస్తుందని హరీశ్రావు అన్నారు. నీళ్లు లేనిచోట కాంగ్రెస్ ప్రాజెక్ట్ ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్నచోట ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. అన్ని రకాల ఆధారాలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసుకున్న ఉత్తరాలు, జీవోలు అన్నీ కమిషన్కు సమర్పించినట్టు హరీశ్రావు పేర్కొన్నారు.
కాళేశ్వరం కార్పొరేషన్కి అనుమతి ఉందా..?
కాళేశ్వరం కార్పొరేషన్కి అనుమతి ఉందా అని అడిగారనీ, కాళేశ్వరం కమిషన్కు స్పష్టంగా అనుమతి ఉన్న విషయాన్ని అన్ని ఆధారాలతో సమర్పించినట్టు హరీశ్రావు తెలిపారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీ లోకేషన్ మార్పుల గురించి అడగ్గా, అది పూర్తిగా టెక్నికల్ నిర్ణయం. ఇంజినీర్ల డీటెయిల్ సర్వే ఆధారంగా బ్యారేజ్ లొకేషన్ మారిందనీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకునే నిర్ణయమని చెప్పానని అన్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా కమిషన్కి సమర్పించామన్నారు.
కూళేశ్వరం అని అంటున్నారు..
ఇక ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్లకు కెపాసిటీ ఎంత అని కమిషన్ చైర్మెన్ అడిగిన ప్రశ్నకు 141 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించామని చెప్పానని వివరించారు. కాళేశ్వరంపై పిచ్చికూతలు కూస్తూ కూళేశ్వరం అని మాట్లాడుతున్నారనీ, కాళేశ్వరంలో 100 భాగాలు, అన్ని ఇంటెక్ట్ ఉన్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం.. పూర్తిగా ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయని హరీశ్రావు తెలిపారు.
మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం..
ముఖ్యమంత్రి గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారనీ, ఈ ప్రాజెక్టుకు నీళ్లు మల్లన్న సాగర్ నుంచి పోతాయని, మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమని, హైదరాబాద్ మూసీ సుందరీకరణకు మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తరలిస్తామంటున్నారని హరీశ్రావు అన్నారు. ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగమని, అదేవిధంగా హైదరాబాద్కు తాగునీటిని మల్లన్న సాగర్ నుంచి ఇస్తామంటున్నారని, అది కాళేశ్వరంలో భాగం కాదా అని తెలిపారు. మల్లన్నసాగర్పై ఆధారపడ్డ గంధమల్లకు టెండర్లు పిలిచి శంకుస్థాపన చేస్తారని, మరో పక్క కాళేశ్వరం కూలింది అని దుష్ప్రచారం చేస్తారని హరీశ్రావు మండిపడ్డారు.
మహారాష్ట్ర, సీడబ్ల్యూసీ అభ్యంతరాలతోనే రీడిజైన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES