ఉక్కు కార్మికుల దీక్షా శిబిరాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
నేలపైనే నిరసనల కొనసాగింపు
ఉక్కునగరం : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ దిశా నిర్ధేశం మేరకు కార్మికులపై ఇప్పటికే పెద్దఎత్తున కక్ష సాధింపు చర్యలు అమలౌతున్న సంగతి తెలిసిందే. మరోవైపు భయోత్పాతం సృష్టించడానికి పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. తాజాగా, ఏళ్ల తరబడి కూర్మనపాలెం కూడలిలో కార్మికులు నిర్వహిస్తున్న దీక్షా శిబిరంలోకి పోలీసులు ప్రవేశించారు. దీక్షా శిబిరాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీక్షను నిర్వహించుకునేందుకు కార్మికులు వేసుకున్న కుర్చీల్లో కూర్చుని కదలడానికి నిరాకరించారు. పైగా కార్మికులనే అక్కడి నుండి వెళ్లిపోవాలని పదేపదే హెచ్చరించారు. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది. దీక్షా శిబిరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్న వార్తలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్మికులు ఎక్కడికక్కడ నిరసన తెలిపారు. సోమవారం ఉదయం రోజుమాదిరే దీక్షలను కొనసాగించడానికి కార్మికులు శిబిరం వద్దకు వచ్చారు. అప్పటికే 70 మందికిపైగా పోలీసులు దీక్షా శిబిరాన్ని స్వాధీనం చేసుకుని కార్మికులను లోనికి రాకుండా అడ్డుకున్నారు. అక్కడ ఆందోళనలు, దీక్షలు చేయడానికి వీలులేదని హెచ్చరించారు. ఈ చర్యను కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించారు. శాంతియు తంగా ఏళ్లతరబడి నిర్వహిస్తున్న శిబిరాన్ని ఎలా స్వాదీ óనంచేసుకుంటారని ప్రశ్నించారు.అయినా, పోలీసులు స్పందించకపోవడం తో శిబిరం వద్దే నేలపై కూర్చుని దీక్షలు కొనసాగించారు. విశాఖలో జరిగిన ఆందోళనలో ఈ ఘటనపై స్పందించిన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలనుకుంటే అది ఎవరితరమూ కాదని హెచ్చరించారు. స్టీల్ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరాం, ప్రధాన కార్యదర్శి రామస్వామి, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ, ఐఎన్టియుసి అధ్యక్షులు రమణమూర్తి , సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు , స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ తదితరులు అణచివేత చర్యల ద్వారా తమ పోరాటాన్ని అడ్డుకోలేరని చెప్పారు.
ఏపీ సర్కారు క్రౌర్యం
- Advertisement -
- Advertisement -