Friday, June 13, 2025
E-PAPER
Homeజాతీయంమ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రూ.91లక్ష‌లు కాజేసిన సైబ‌ర్ నేర‌గాళ్లు

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రూ.91లక్ష‌లు కాజేసిన సైబ‌ర్ నేర‌గాళ్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో సైబ‌ర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. షేర్ మార్కెట్‌లో అధిక లాభాల పేరుతో ఓ కాంట్రాక్ట‌ర్‌కు మాయ‌మాట‌లు చెప్పి..రూ.91ల‌క్ష‌ల కాజేశారు. గ్వాలియ‌ర్ చెందిన జైసింగ్ చౌహాన్ గతంలో ప‌లుమార్లు షేర్ మార్కెట్లో పెట్టుబ‌డులు పెట్టారు. ఈ క్ర‌మంలో త‌మ కంపెనీలో పెట్టుబ‌డులు పెడితే..30శాతం లాభాలు ఇస్తామ‌ని బాధితుని వాట్సాప్ కు ఈనెల 8న మెసెజ్ వ‌చ్చింది. వారి సందేశానికి బ‌దులు పంపి..సైబ‌ర్ నేర‌గాళ్లు ఇచ్చిన లింక్ ను ఒపెన్ చేశాడు. అప్ప‌టున్నంచి ప‌లు ద‌ఫాలుగా సైబ‌ర్ నేరగాళ్ల‌తో బాధితుడు లావాదేవీలు నిర్వ‌హిస్తున్నాడు. ఈక్ర‌మంలో బాధితుని బ్యాంక్ ఖాతా నుంచి రూ.91ల‌క్ష‌లు విత్ డ్రా అయిన‌ట్టు సెల్ ఫోన్ కు మెసెజ్ వ‌చ్చింది. తాను మోసపోయిన‌ట్టు గ్ర‌హించిన బాధితుడు..వెంట‌నే స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును సైబ‌ర్ క్రైమ్ విభాగానికి బ‌దిలీ చేశామ‌ని ASP నిరంజ‌న్ శ‌ర్మ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -