- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇజ్రాయెల్ శుక్రవారం తెల్లవారుజామున చేసిన దాడులతో ఇరాన్కు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ దేశ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి కూడా ఈ దాడిలో మృతి చెందినట్లు ఇరాన్కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. దీనిని ప్రభుత్వ మీడియా సంస్థ ఐఆర్ఎన్ఎన్ ధ్రువీకరించింది. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికే ఇరాన్ టాప్ అణుశాస్త్రవేత్తలు కూడా మరణించారు. వీరితోపాటు సైన్యంలోని సీనియర్ జనరల్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐఆర్జీసీ చీఫ్ హొస్సేన్ సలామీ కూడా తుది శ్వాస విడిచారు.
- Advertisement -