- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ అనంతరం సివిల్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రధాని వెంట కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తదితరులు ఉన్నారు. అనంతరం మోడీ గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను పరామర్శించే అవకాశం ఉంది.
- Advertisement -