- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం పట్ల జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాసాల మీద విమానం కూలడంతో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రయాణికులు, సామాన్యులు,వైద్య విద్యార్థులు మరణించడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ మరణించిన కుటుంబాలను ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆర్థికంగా వారి కుటుంబన్నీ ఆదుకోవాలని,వారి ఆప్తులను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గారు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పవిత్రమైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
- Advertisement -