- Advertisement -
నవతెలంగాణ- బజార్ హత్నూర్: మండలంలోని జాతర్ల గ్రామంలోని నాగోబా, వెంకటేశ్వర ఆలయ సముదాయం వద్ద సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో మాడగుడ, పార్డి, పాట్నాపూర్ పాఠశాలల విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ లు పాల్గొని విద్యార్థులతో అక్షరాభ్యాసాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్షరాబ్యాసంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పిల్లల చదువు ప్రారంభానికి ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా పిల్లలు మంచి చదువు చదివి ఉన్నత స్థాయిలకు చేరుకోవాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -