నవతెలంగాణ – కంఠేశ్వర్
అక్రమంగా అమ్ముతున్న ఎండు గంజాయిని శుక్రవారం పట్టుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ స్వప్న తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టుకున్న గంజాయి కి సంబంధించిన వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నిజామాబాద్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు నగరంలోని జకీర్ ఫాం హౌస్ లో దాడి చేసీ తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో షేక్ షకీల్, దాశీ దాతూరాం, దాగే మధుకర్ గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 184గ్రాముల ఎండు గంజాయి, ముబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎవరైనా గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గంజాయి అమ్మిన, సేవించిన ఎవరికైనా సమాచారం తెలిస్తే 8712658970 నంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ ఐ బి.రామ్ కుమార్, నారాయణ రెడ్డి, హమీద్, శివ, ఉత్తమ్, అవినాశ్, బోజన్న, విష్ణు, రాజన్న పాల్గొన్నారు.
గంజాయి పట్టివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES