- Advertisement -
-మిడ్ మానేరు కుడి కాలువ పరిశీలన
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని వడ్లూర్ గ్రామంలో శుక్రవారం సీడబ్ల్యూసీ కేంద్ర కమిటీ బృందం సభ్యులు పర్యటించారు.ప్రధానమంత్రి కృషి సంచాయి పథకంలో అయా జలాశయాల నుండి సాగు నీరందించే కాల్వల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 20 శాతం బడ్జెట్ కేటాయిస్తుండడంతో..మిడ్ మానేర్ కుడి కాల్వ,సాగు కాల్వల తీరును కేంద్ర కమిటీ బృందం సభ్యులు సీడబ్ల్యూసీ ఈఈ ధీరజ్ సింగల్,భూగర్భ జలాల బోర్డు శాస్త్రవేత్త ఎం.సుధీర్ కుమార్,జిల్లా సూపర్డెంట్ ఇంజనీర్ సుమతి దేవి,ఈఈ రాములు నాయక్,అసిస్టెంట్ ఇంజనీర్ మహేందర్ కలిసి పరిశీలించారు.ఆర్డీఓ రామ్మూర్తి,తహసీల్దార్ చంద్రశేఖర్,ఆర్ఐ సంతోష్ కేంద్ర బృందం వెంట ఉన్నారు.
- Advertisement -