హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో రూ.252.5 కోట్ల టర్మ్ లోన్ కోసం ఒప్పందం కుదర్చుకున్నట్లు అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ తెలిపింది. హైదరాబాద్ హార్డ్వేర్ పార్క్లో ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ ఫర్ ఇంజీనియస్ డిఫెన్స్ సిస్టమ్స్ కోసం రూ.110 కోట్ల టర్మ్ లోన్ను వాడనున్నట్లు పేర్కొంది. మరో రూ.142 కోట్లతో రుణాల పునరుద్దరణ చెల్లింపులు చేయనున్నట్లు తెలిపింది.