నవతెలంగాణ -మోపాల్ : శనివారం నిజామాబాద్ నూతన కలెక్టర్ గౌరవ శ్రీ టి వినయ్ కృష్ణా రెడ్డి మోపాల్ రైతు వేదికను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిచే జరిగే మూడవ విడత రైతు నేస్తం వీసీ యూనిట్స్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఒక్కో రైతు వేదికకి 250 మంది రైతులు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. పండగ వాతావరణం అనిపించేలా రైతు వేదికలను పూలతో అలంకరించాలని తెలిపారు. వచ్చిన రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట నిజామాబాద్ ఆర్డీవో జిల్లా వ్యవసాయాధికారి వీరస్వామి ఎంపీడీవో రాములు నాయక్, మండల వ్యవసాయ అధికారి సౌమ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్, ఏ ఈ ఓ రంజిత్, శరత్ చంద్ర,భావన తదితరులు పాల్గొన్నారు.
రైతు వేదికను సందర్శించిన కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES