నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు కోసం స్థలం శుభ్రం చేసే పనులు చేయిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ శనివారం తెలిపారు. పాఠశాలలోనే ఆకుకూరలు, కూరగాయల చెట్లను పెట్టి వాటి ద్వారా తాజా కూరగాయలు ఆకుకూరలతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో కిచెన్ గార్డెన్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా పాఠశాల ఆవరణలో శిథిలావస్థకు చేరిన మరుగుదొడ్లను, చెట్లు, ముళ్ళ పొదలను జెసిబి సహాయంతో తొలగింపజేస్తున్నట్లు వివరించారు. కిచెన్ గార్డెన్ ఏర్పాటు కోసం స్థలం శుభ్రం చేసేందుకు సహకరించిన గ్రామానికి చెందిన చిన్నోళ్ల అరుణ్ రెడ్డి కి పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలిపారు.
పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు పనులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES