Sunday, June 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పార్థివ దేహానికి నివాళి, ఆర్థిక సహాయం అందజేత 

పార్థివ దేహానికి నివాళి, ఆర్థిక సహాయం అందజేత 

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్  : యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట శనివారం, గజం లక్ష్మీనారాయణ అనారోగ్యంతో మరణించారు. మాజీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కళ్లెం విజయ జహంగీర్ గౌడ్ పార్థివ దేహానికి నివాళి అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి  తెలియజేశారు. వారు తమ సొంత నిధులతో వారి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కో ఆప్షన్ ఎండి యాకూబ్, గజం లచ్చి నరసయ్య, ఒగ్గు కిషన్, ఎండి జాంగిర్, తోటకూరి యాకయ్య, వాకిటి లక్ష్మీనారాయణ, కోల వెంకటేష్ గౌడ్, ఒగ్గు కార్తీక్, దొంతి బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -