విశ్వం, మానవ సృష్టికి మూలం భౌతికం తప్ప భావం కాదు
శాస్త్రీయ దృక్పథం ఉండాలి
రాజ్యాంగము చట్టాలపై అవగాహన అవసరం
జన విజ్ఞాన వేదిక జిల్లా క్లాసుల్లో వక్తల ప్రసంగాలు
నవతెలంగాణ – కంటేశ్వర్ : రాజ్యాంగము చట్టాలపై అవగాహన అవసరమని, ప్రతిదీ ప్రశ్నించు కృష్ణ ప్రగతికి మెట్టు అని, విశ్వం మానవ సృష్టికి మూలం భౌతికం తప్ప భావం కాదు అని, శాస్త్రీయ దృక్పథం ఉండాలని జన విజ్ఞాన వేదిక జిల్లా క్లాసులలో వక్తలు ప్రసంగించారు. ఈ మేరకు శనివారం జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా క్లాసులు పెన్షనర్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. ఈ క్లాసుల్లో జన విజ్ఞాన వేదిక చరిత్ర పై కోయేడి నర్సింహులు, మన విశ్వం మానవ పరిణామంపై సురేష్ కావాలా రాజ్యాంగంపై సాయన్నలు వివిధ అంశాల పట్ల ఈ క్లాసులకు విచ్చేసిన ప్రతినిధులకు కార్యకర్తలకు అవగాహన చేశారు.
ఉదయం మొదటి సెషన్ లో జన విజ్ఞాన వేదిక చరిత్ర గురించి కోయేడి నర్సింహులు మాట్లాడుతూ.. జనవిజ్ఞాన వేదిక 19 88 ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం రోజు ఆవిర్భవించిందని తెలిపారు. ఆవిర్భావం కంటే ముందు సమాజ మార్పు కోరే ఉద్యోగస్తులు ఇంజనీర్స్, డాక్టర్లు శాస్త్రవేత్తలు కలిసి భారత జన విజ్ఞాన జాత ద్వారా గ్రామాన్ని తెలుసుకో గ్రామాన్ని మార్చుకో అనే కాన్సెప్ట్ పై కళాజాత తిప్పడం జరిగిందని అక్షరాస్యత, సారా వ్యతిరేక,పొదుపు ఉద్యమం లాంటి అనేక శాస్రియ అంశాల పై చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన సైన్స్ ఉద్యమ సంస్థ జనవిజ్ఞాన వేదిక అనే వివరించారు. మన విశ్వం అనే అంశంపై సురేష్ కావాల్లా ప్రసంగిస్తూ విశ్వం మానవ మనగడ పుట్టుపూర్వోత్తరాలు భౌతిక భావవాదం ఖైగోలం, పదార్థం అనే అంశాల పట్ల ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజ్యాంగంపై సాయన్న ప్రసంగిస్తూ రాజ్యాంగ ఆవశ్యకత,బాధ్యత హక్కులు, చట్టాలు తదితర అంశాల పై అవగాహన చేశారు. ఈ క్లాసులకు జె వి వి జిల్లా అధ్యక్షులు కోయేడి నర్సింహులు అధ్యక్షత వహించగా జె వి వి రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు మాడరేటర్ గా వ్యాహరించారు. ఇంకా ఈ క్లాసులు జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్, వెంకట మల్లయ్య విజయ ఆనంద రావు, రామకృష్ణ, పెద్ది వెంకట రాంలు ప్రసంగించారు. ఇట్టి క్లాసుల్లో ప్రతినిధులు జెవివి కార్యకర్తలు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగాయి. కళకారులు రాజశేఖర్ బృందం పాడిన పాటలు ఆలోచింప చేసాయి.