Sunday, June 15, 2025
E-PAPER
Homeజాతీయంఅయోధ్యలో ఉర్సు ఉత్సవాలకు అనుమతి నిరాకరణ

అయోధ్యలో ఉర్సు ఉత్సవాలకు అనుమతి నిరాకరణ

- Advertisement -

– శాంతి భద్రతల సాకు చూపిన యోగి ప్రభుత్వం
– బారాబంకిలో కూడా..
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, బారాబంకిలో వార్షిక ఉర్సు ఉత్సవాలకు యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. శాంతి భద్రతల కారణంగా ఉత్సవాల నిర్వహణకు అనుమతి నిరాకరిస్తున్నామని తెలిపింది. అయోధ్యలోని ఖాన్పూర్‌ మసోధా ప్రాంతంలో ఉన్న దాదా మియా మసీదులో ఉర్సు నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వీహెచ్‌పీ చేసిన ఫిర్యాదు కారణంగా ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అలాగే బారాబంకికి సంబంధించి ఫూల్‌పూర్‌ ప్రాంతంలో సయ్యద్‌ షకీల్‌ బాబా ఉర్సుకు కూడా అనుమతి నిరాకరించారు. అశాంతి చెలరేగే అవకాశం ఉన్నదంటూ అధికారులు సాకులు చెప్పారు.

లక్నో: ఘాజీ బాబా పేరుతో అయోధ్య లో ఉర్సు నిర్వహించాలని నిర్ణయించారని వీహెచ్‌పీ ఫిర్యాదు చేసింది. ఘాజీ బాబా అంటే మహమ్మద్‌ గజనీ మేనల్లుడుగా ప్రసిద్ధి చెందిన 11వ శతాబ్దపు సెమీ- లెజెండరీ సైనిక వ్యక్తి సయ్యద్‌ సలార్‌ మసూద్‌. ఘాజీబాబా పేరుతో ఉర్సు నిర్వహిస్తు న్నారని తెలియడంతో ‘ఉర్సు దాదా మియా’ పేరిట మంజూరు చేసిన అనుమతిని రద్దు చేస్తు న్నట్టు అయోధ్య సర్కిల్‌ అధికారి అశుతోష్‌ తివారీ తెలిపారు. సయ్యద్‌ సలార్‌ మసూద్‌ ఘాజీ జ్ఞాపకార్థం ముస్లిం సమాజం ఎంతో కాలంగా నిర్వహిస్తున్న పురాతన ఉత్సవం ‘నేజా మేళా’ను మార్చిలో సంభాల్‌ పోలీసులు నిషేధించారు. ఆక్రమణదారుడు, దోపిడీ దారుడు, హంత కుడి గౌరవార్థం జరిగే కార్యక్రమాన్ని అనుమతించే ప్రశ్నే లేదని వారు స్పష్టం చేశారు. ఈ ఉత్సవం ఏటా సంప్ర దాయబద్ధంగా నిర్వహిస్తున్నప్పటికీ ఈ ఏడాదే నిషేధించడం గమనార్హం.
కేంద్రంలోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఘాజీ హత్యకు పాల్పడినట్లు ఆరోపణ లున్న సుహల్దేవ్‌కు ఎనలేని గౌరవం లభించింది. ఆయన కు ఓ స్మారక చిహ్నాన్ని నిర్మించింది. ఘాజీపూర్‌ నుండి ఢిల్లీకి సూపర్‌ ఫాస్ట్‌ రైలును ప్రారంభించింది. కొత్తగా విశ్వ విద్యాయాన్ని ఏర్పాటు చేసింది. స్టాంపును కూడా ముద్రించి సుహల్దేవ్‌ను గౌరవించింది. వెనుకబడిన తరగతులకు చెందిన హిందువులను మచ్చిక చేసుకునేందుకే బీజేపీ ప్రభుత్వం ఈ రాజకీయ ఎత్తుగడ వేసిందన్నది సుస్పష్టం. బారాబంకి ఉర్సు ఉత్సవాలపై అదనపు ఎస్పీ వికాస్‌ త్రిపాఠీ మాట్లాడుతూ ‘కొన్ని వివాదాలు తలెత్తాయి. అవి మత పరమైన ఘర్షణలకు దారితీయవచ్చు. అందుకే పరిపాలనా సంబంధమైన అనుమతులను రద్దు చేయడం జరిగింది’ అని చెప్పుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -