Monday, June 16, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌ మ్యాప్‌ను తప్పుగా చూపించినందుకు ఇజ్రాయిల్‌ మిలటరీ క్షమాపణలు

భారత్‌ మ్యాప్‌ను తప్పుగా చూపించినందుకు ఇజ్రాయిల్‌ మిలటరీ క్షమాపణలు

- Advertisement -

జెరూసలేం: భారత్‌ మ్యాప్‌ను తప్పుగా చూపించినందుకు ఇజ్రాయిల్‌ మిలటరీ శనివారం క్షమాపణలు చెప్పింది. జమ్మూ కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో అంతర్భాగంగా ఆ మ్యాప్‌లో చూపించారు. దీనిపై భారత్‌ నెటిజన్ల నుండి తీవ్ర ప్రతిస్పందన ఎదురైంది. దాంతో తప్పు జరిగిందని అంగీకరిస్తూ, సరిహద్దులను కచ్చితంగా చూపించడంలో ఆ మ్యాప్‌ విఫలమైందని ఇజ్రాయిల్‌ మిలటరీ వివరించింది. శుక్రవారం ఇజ్రాయిల్‌ రక్షణ బలగాలు (ఐడిఎఫ్‌) తమ ఎక్స్‌ పోస్టులో ఈ మ్యాప్‌ను పోస్టు చేశాయి. ఇరాన్‌ క్షిపణుల రేంజ్‌ను చూపించేందుకు ఈ మ్యాప్‌ను ప్రచురించాయి. ఈ పోస్టుపై భారత్‌లోని సోషల్‌ మీడియా యూజర్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇటువంటి చిత్రాన్ని ప్రచురించడం వల్ల జరిగిన తప్పిదానికి క్షమాపణలు చెపుతున్నామని ఐడిఎఫ్‌ పేర్కొంది. ఈ వివాదంపై భారత్‌లో ఇజ్రాయిల్‌ రాయబారి రూవెన్‌ అజర్‌ స్పందిస్తూ ఆ మ్యాప్‌ను ‘చెడును ఉద్దేశించని ఇన్ఫోగ్రాఫిక్స్‌’ గా అభివర్ణించారు. వెంటనే ఆ మ్యాప్‌ను తొలగించాల్సిందిగా కోరినట్లు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -